ఐపీఎల్ 2023: రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ క్రికెటర్ !

-

ఇండియాలో ఎంతో ఆదరణ దక్కించుకున్న క్రికెట్ లీగ్ ఐపీఎల్ సీజన్ 16 ఇంకొక రోజులో మొదలుకానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ తమ ప్లేయర్స్ తో ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నాయి. కొందరు ప్లేయర్స్ గాయాలు మరియు ఇతర కారణాల వలన ఈ లీగ్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అయితే ఏకంగా కెప్టెన్ రిషబ్ పంత్ టోటల్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. అయితే ఇన్ని రోజులు ఇతని స్థానంలో ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ ఎవరిని భర్తీ చేస్తారో అని పంత్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక కీలక స్టెప్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ కు చెందిన క్రికెటర్ అభిషేక్ పారెల్ ను తీసుకోవడానికి రెడీ అయిందట. ఇంత వరకు అధికారికంగా ప్రకటించకపోయినా… దాదాపుగా ఇదే ఫైనల్ అని తెలుస్తోంది. మరి రిషబ్ పంత్ లాంటి ఛాంపియన్ స్థానంలోకి రానున్న అభిషేక్ పారెల్ ఏ విధంగా రాణిస్తాడు అనాది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news