కోటి రూపాయలతో దుర్గామాతను అలంకరించారు…!

-

దేశవ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో.. వారికి నచ్చిన విధంగా దుర్గా మాతను అలంకరిస్తూ పూజిస్తున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దుర్గా అమ్మవారిని ఏకంగా కోటి రూపాయల కరెన్సీతో అలంకరించారు. ఓ మండపంలో అమ్మవారిని 500, 2000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆ మండపంలో ఎక్కడ చూసినా కరెన్సీనే ఉండటంతో… లక్ష్మీదేవిలా అలంకరించబడిన దుర్గామాతను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news