ఈ రైల్వే స్టేషన్‌ను 3 వేల మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు!

-

వెయ్యి కాదు రెండు వేలు అంతకన్నా కాదు.. ఏకంగా 3 వేల మీటర్ల ఎత్తులో ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు తెలుసా మీకు. అది కూడా 26 కిలోమీటర్ల భారీ సొరంగంతో పాటు. ఈ అరుదైన రైల్వే లైన్, రైల్వే స్టేషన్‌కు వేదికయింది హిమాచల్ ప్రదేశ్. భారత్, చైనా సరిహద్దు సమీపంలో ఉన్న బిలాస్‌పూర్-మనాలి-లెహ్ మార్గంలోనే ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి లెహ్ వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసమే ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అంతే కాదు.. సరిహద్దుల్లో కాపలా కాసే భద్రతా దళాలు సరిహద్దులను త్వరగా చేరుకోవడం కోసం కూడా ఈ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. భారీ సొరంగం కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని కెలాంగ్‌లో తొలి స్టేషన్‌ను నిర్మించనున్నారు. అది ఏకంగా 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా 3 వేల మీటర్ల ఎత్తులో నిర్మించే రైల్వే స్టేషన్‌గా అది చరిత్రకెక్కనుంది. ఇక.. 26 కిలోమీటర్ల భారీ సొరంగంలో 74 టన్నెళ్లు, 124 పెద్ద వంతెనలు, 396 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి లెహ్ కు కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి లెహ్‌కు చేరుకోవడానికి కనీసం 40 గంటలు పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news