భోజనం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా? ఏముంది తిన్నది అరగడానికి అనుకే కదా అనుకునేరు!

-

భారతదేశంలోని ప్రతి ఇంట్లో సోంపు ఉండాల్సిందే. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా వచ్చేముందు సోంపు నోట్లో వేసుకోవాల్సిందే. అసలు ఆహారం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో చాలామందికి తెలియదు. అయినా తింటూ ఉంటారు. కొంతమంది అయితే నోరు మంచి సువాసన వచ్చేందుకు అని చెబుతుంటారు. సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి :
సోంపు శరీర జీవక్రియను పెంచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం రుగ్మతలను నివారించడానికి, కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్‌కు సోంపు గింజలు చాలా మంచివి. వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తాయి.

అజీర్ణాన్ని నివారిస్తుంది :
నోటిలో సోంపు వేసుకోవడం వల్ల నోరు రీఫ్రెష్ అవ్వడమే కాకుండా మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. నోటిలోని లాలాజల గ్రంథిని ప్రేరేపిస్తుంది. దీంతోపాటు ఎక్కువ లాలాజలాలను పొందేందుకు సహాయపడుతుంది. దీనివల్ల దంతాలు శుభ్రంగా ఉంటాయి. శరీరం శుభ్రపడుతుంది. జీర్ణక్రియను నిరోధిస్తుంది.

రక్తపోటు తగ్గిస్తుంది :
సోంపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె సమస్యలను దూరం చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఎందుకంటే సోంపులో పొటాషియం అధికంగా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
భోజనం తిన్న తర్వాత ఆహారం జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు సోంపు తీసుకుంటాం. ఎందుకంటే సోంపులో కరిగే ఫైబర్ ఉంది. సోంపు నోట్లో వేసుకొని నమలగానే దాని రసం శరీరంలోని జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం నివారించబడుతుంది :
సోంపు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తూ వ్యర్థాలను తొలిగిస్తుంది. దీనివల్ల లాభమే కాని నష్టం లేదని ఎక్కువగా తినకూడదు. లేదంటే కడుపులో పరిస్థితి అంతా తారుమారవుతుంది.

క్షయ, ఉదర ఉబ్బరం నివారించబడుతాయి :
శరీరంలోని నీటి సమస్యను పరిష్కరించడానికి సోంపు సహాయపడుతుంది. మూత్రవిసర్జన లక్షణాలు, ఉదర ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news