ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మహిళలు మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు..!

-

మహిళలకి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే మహిళలు కూడా ఇళ్లల్లోనూ, ఆఫీసులో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. లేదు అంటే అన్నిటినీ చూసుకోవడం కష్టం అయిపోతుంది. మీరు కనుక మీ డైట్ లో ఈ పదార్థాలను చేసుకున్నారు అంటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు.

పసుపు:

మామూలుగా పసుపుని అనేక వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాము. దీనిని సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఆయుర్వేదం ప్రకారం పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలానే పసుపు లో ఉండే కర్క్యుమిన్ ఇమ్మ్యూనిటిని పెంచుతుంది. అలానే దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి వంటలోనూ మీరు చేసే రెసిపీస్ లోని పసుపుని వాడండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

తేనె:

తేనెని చాలా రెసిపీస్ లో ఉపయోగించవచ్చు. పంచదారకు బదులుగా మీరు వంటల్లో తేనెను ఉపయోగించండి. తేనె లో నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీటి లో నిమ్మ రసం వేసి తేనెని తీసుకోండి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది.

సోయాబీన్స్:

సోయాబీన్స్ మీ డైట్ లో చేరితే చాలా మేలు కలుగుతుంది. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. దీనిని మీరు రోస్ట్ చేసుకోవచ్చు లేదా ఉడికించుకుని తీసుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ ప్రోటీన్స్ మీకు అందుతాయి.

ఉసిరి:

ఉసిరి లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది మరియు ఇతర మినిరల్స్, విటమిన్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇది చర్మానికి మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. మీరు ఉసిరి కాయలను తీసుకోవచ్చు లేదు అంటే ఆమ్లా జ్యూస్ ని కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు. దీని వల్ల కూడా మీకు సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news