ఈ నలుగురు వ్యక్తులతో వాదన వద్దు..అస్సలు మంచిది కాదు..!

-

ఆచార చాణక్య ఎన్నో మంచి విషయాలను చెప్పారు. వీటిని కనుక మనం జీవితంలో ఆచరిస్తే జీవితాంతం ఆనందంగా ఉండేందుకు అవుతుంది. అలానే జీవితంలో మన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా అవుతుంది. ఆచార్య చాణక్య ఈ నలుగురికి దూరంగా ఉండమని వీళ్ళ తో వాదన వద్దు అని… అసలు వాళ్లతో పెట్టుకోకూడదని చెప్తున్నారు మరి ఎటువంటి వ్యక్తులతో మనం వాదనకి దూరంగా ఉండాలి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంలో ఈ నలుగురు వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మన గురువుగారు:

మన గురువు గారితో మనం వాదనకి దిగకూడదు గురువుగారికి ఈ విషయంలో దూరంగా ఉండాలి. అజ్ఞానాన్ని తొలగించేసి విజ్ఞానాన్ని ఇచ్చే గురువుకి మనం గౌరవం ఇవ్వాలి తప్ప వాదించుకోకూడదు.

మూర్ఖుడు:

మూర్ఖుడు తో ఎప్పుడు వాదన పెట్టుకోకూడదు నిజం అబద్ధం తేడా తెలియకుండా మూర్ఖుడు అనవసరంగా వాదిస్తూ ఉంటాడు. ఇలాంటి వారితో వాదించడం కంటే వదిలేసి బయటికి వచ్చేయడం మంచిది.

మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు:

మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో కూడా వాదన పెట్టుకోకూడదు. ఇలాంటి వారితో వాదనకి దిగితే మీకు వారికి కూడా ఇబ్బందే.

మంచి స్నేహితుడు:

మంచి స్నేహితుడుతో కూడా గొడవ పెట్టుకోకూడదు. మంచి స్నేహితులతో గొడవ పెట్టుకోవడం వలన ఒక మంచి స్నేహితుడు ని మీరు కోల్పోతారు పైగా స్నేహితుడు మంచి చెడు రెండు చెబుతూ ఉంటాడు కాబట్టి అస్సలు స్నేహితుడితో వాదన పెట్టుకోకండి.

Read more RELATED
Recommended to you

Latest news