ఎయిర్‌హోస్టెస్‌- పాసింజర్ మధ్య డిష్యుం..డిష్యుం.. చివరికి..

-

విమానాల్లో ప్రయాణించేవారికి సిబ్బందికి అప్పుడప్పుడు గొడవలు రావడం సహజం.. విమాన సిబ్బంది ఎంత మర్యాదగా వారిని చూసుకున్నా కూడా కొన్ని సార్లు గొడవలు రావడం కామన్.. ఎయిర్‌పోర్టు అథారిటీ నియమ నిబంధనలు పాటిస్తారు. ప్రయాణికులు కూడా చాలా సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించరు. కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోకుండా జరిగే ఘటనలు వైరల్

అవుతూ ఉంటాయి. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానంలో ప్రయాణికుడికి- ఎయిర్‌హోస్టెస్‌ కి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇస్తాంబుల్‌-ఢిల్లీ విమానంలో డిసెంబరు 16వ తేదీన ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య ఫుడ్ విషయం లో గొడవ జరిగింది.. అది కాస్త వైరల్ అయ్యింది.. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ విషయంపై ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, కస్టమర్ సౌలభ్యమే తమ ప్రాధాన్యతగా విమానయాన సంస్థ ప్రకటించింది.ఎయిర్‌ హోస్టెస్‌ సదరు ప్రయాణికుడి తో మాట్లాడుతూ.. మీవల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్‌ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తామని చెప్పగా.. ఈ సమాధానానికి తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు.. నువ్వు ప్రయాణికుడికి అసిస్టెంట్ వి అని వాధించాడు.. దాంతో మాటా మాటా పెరిగింది.. వారి గొడవను సదరు ప్రయాణికులు వీడియో తీసి నెట్లో పెట్టారు. ఆమె సహోద్యోగి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దు మణిగింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది… రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంధి..

Read more RELATED
Recommended to you

Latest news