5100 మంది దివ్యాంగులకు అన్నదానం

-

Ambanis serve food to 5,100 people for Isha’s wedding

అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదట. అందుకే కాబోలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు అన్నదానం చేసి తమ గొప్పతనాన్ని చాటుకుంటుంటారు. తాజాగా ముకేశ్ అంబానీ ఫ్యామిలీ కూడా 5100 మందికి అన్నదానం చేస్తూ శెభాష్ అనిపించుకున్నారు.

డిసెంబర్ 12న ముకేశ్ కూతురు ఈషా పెళ్లి ఉంది కదా. ఈ సందర్భంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ముకేశ్ ఫ్యామిలీ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. దాన్నే అన్న సేవ అంటారట. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. 7 న ప్రారంభమైన ఈ అన్న సేవ 10 వరకు ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, ఈషా అంబానీ, నీతా అంబానీ, అనంత్, ఈషా పెళ్లి చేసుకోబోయే వరుడు ఆనంద్ పిరమాల్ కూడా పాల్గొన్నారు. ఓవైపు అన్నదాన కార్యక్రమం, మరోవైపు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news