ధోనీ బైక్‌లు ఉంచిన మాన్ష‌న్‌ను చూశారా..?

-

టీమిండియా క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఎంత బాగా ఆడ‌తాడో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడంటే టెస్ట్ మ్యాచ్‌లు ఆడ‌డం లేదు రిటైర‌య్యాడు. కానీ ఒక‌ప్ప‌టి ధోనీ అయితే వేరే. త‌న‌దైన హెలికాప్ట‌ర్ స్టైల్ షాట్ల‌తో అభిమానులను ధోనీ ఎంత‌గానో అల‌రించాడు. అయితే ధోనీకి కేవ‌లం క్రికెట్ మాత్ర‌మే కాదు, బైక్‌ల‌న్నా చాలా ఇష్టం. అందుకే అనేక కంపెనీల‌కు చెందిన ఖ‌రీదైన బైక్‌ల‌ను ధోనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొనుగోలు చేస్తుంటాడు. ఇక తీరిక దొరికిన‌ప్పుడ‌ల్లా వాటిపై సిటీలో చ‌క్క‌ర్లు కొడుతుంటాడు. అలా అత‌ను తిరుగుతున్న‌ప్పుడు తీసే ఫోటోల‌ను చూసి ధోనీ అభిమానులు కూడా తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే మీకు తెలుసా..? నిజానికి ధోనీ వ‌ద్ద చాలా బైక్‌లు ఉన్నాయి. మ‌రి వాట‌న్నింటిని ఎక్క‌డ ఉంచుతాడు ? అనే సందేహం మీకు ఎప్పుడు రాలేదా ? అవును.. వ‌చ్చి ఉండ‌దు. అయితే వినండి.. ధోనీ త‌న బైక్‌ల‌ను ఉంచడం కోసమే ప్ర‌త్యేకంగా ఓ మాన్ష‌న్‌ను క‌ట్టించాడు తెలుసా..? అది కూడా రాంచీ సిటీలో.

రాంచీ సిటీలో దూరంగా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ధోనీ మాన్ష‌న్ ఉంటుంది. అందులో బైక్‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ భారీ షెడ్‌ను ధోనీ క‌ట్టించాడు. అది ఇంట్లోనే క‌ల‌సిపోయి ఉంటుంది. బ‌య‌టి నుంచి చూస్తే బైక్‌ల షోరూమేమో అనిపిస్తుంది. కాగా ఆ మాన్ష‌న్‌లో ఉన్న బైక్‌ల‌ ఫోటోల‌ను ధోనీ భార్య సాక్షి తాజాగా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. కావాలంటే ధోనీ బైక్‌లు ఉంచిన మాన్ష‌న్‌పై మీరూ ఓ లుక్కేయ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news