స్పాంజి పరుపులపై నిద్రిస్తే భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ వచ్చే ప్రమాదం ఉందిగా..!!

-

ఒకప్పుడు అందరి ఇళ్లల్లో నులక మంచాలు ఉండేవి. అయితే ఆ మంచాల మీద లేకపోతే చాప వేసుకుని కిందపడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పట్టుపరుపులు వచ్చేశాయి. మెత్తటి ఈ పరుపుల మీద పడుకుంటే సుఖమైన నిద్రపడుతుందని అనుకుంటారు. కానీ మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకుంటున్నట్లు మీకు తెలియడం లేదు. ప‌రుపుల త‌యారీలో ఫార్మ‌ల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్త‌లీన్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటి వ‌ల్ల కళ్లు, ఊపిరితిత్తులు, చ‌ర్మానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అల‌ర్జీలు, దుర‌ద‌లు, ఇన్ఫెక్ష‌న్‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

నాఫ్తలీన్ వ‌ల్ల మూత్ర‌పిండాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నాఫ్తలీన్ అనే ర‌సాయ‌నం కార‌ణంగా పొత్తి క‌డుపులో నొప్పి ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశం ఉంద‌ని నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే బెంజీన్ వ‌ల్ల క‌డుపులో అల్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ర‌సాయ‌నం కార‌ణంగా క‌ణాల డి ఎన్ ఎ దెబ్బ‌తీన‌డం ఆరోగ్యంగా ఉండే క‌ణాలు క్యాన్స‌ర్ క‌ణాలుగా మార‌డం వంటివి జ‌రుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. స్పాంజి ప‌రుపులు వేడిని ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ వేడి కార‌ణంగా ర‌సాయ‌నాలు విడుద‌లై గాలి ద్వారా నెమ్మ‌దిగా శ‌రీరంలోనికి వెళ్లి మ‌న మీద చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

పరుపుల్లో ఉండే కుష‌నింగ్ కార‌ణంగా వాటిపై మ‌నం ప‌డుకున‌ప్పుడు మ‌న శ‌రీర ఆకృతి మారుతుంది. దాని వ‌ల్ల డిస్క్‌ల పై ఒత్తిడి ప‌డ‌డం, డిస్క్ లు వ‌త్త‌బ‌డ‌డం, డిస్క్‌లు ప‌క్క‌కు జ‌ర‌గ‌డం జ‌రుగుతుంది. డిస్క్ లు ప‌క్క‌కు జ‌ర‌గ‌డం వ‌ల్ల న‌రాలు, వెన్నుపాముపై ఒత్తిడి ప‌డుతుంది. పూర్వ‌కాలంలో ఉప‌యోగించిన విధంగా దూది ప‌రుపుల‌ను ఉప‌యోగించ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌స్తుత కాలంలో దూదితో త‌యారు చేసిన మెత్త‌టి ప‌రుపులు, మంచి నాణ్య‌మైన ప‌రుపులు మ‌నకు ల‌భిస్తున్నాయి. ఇలాంటి పరుపుల‌ను వాడ‌డం వ‌ల్ల ర‌సాయ‌నాలు విడుద‌ల అవ్వ‌కుండా ఉంటాయి. అలాగే మ‌నం వాటిపై మ‌నం ప‌డుకున్న‌ప్పుడు మ‌నం వెన్నుపూస ఆకృతి మార‌కుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news