సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

-

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. సాధారణంగా మాంసం తినాలనుకునేవారు ఏ మటన్ షాపో, చికెన్ షాపుకు వెళ్లి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కొనుక్కోవాలన్నా.. కిరాణం లేదా చికెన్ షాపులే దిక్కు. కానీ ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్, గుడ్ల షాపును నిర్వహిస్తున్నాడు. మలమూత్ర విసర్జన చేసే ప్రదేశంలో మటన్, చికెన్, గుడ్లు అమ్మడం, కొనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఇలాంటి ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తన యజమాని సులభ్ కాంప్లెక్స్ నిర్వహించుకోమని అప్పగిస్తే.. అతడు డబ్బులు సంపాదించాలని సులభ్ కాంప్లెక్స్ ని కాస్త మటన్, గుడ్లు అమ్మే కేంద్రంగా మార్చేశాడు. ఒక వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే డబ్బులతోపాటు సొంతంగా మటన్ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు చెకింగ్ నిర్వహించగా.. అప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిధిలోని ఓ సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడి నిర్వాకం ఇది. సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తూనే.. మనీ కౌంటర్ దగ్గర మటన్, గుడ్లను అమ్మడం ప్రారంభించాడు. అది చూసిన కొందరూ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండోర్ మున్సిపాలిటీ అధికారులు ఆ సులభ్ కాంప్లెక్స్ పై తనిఖీ నిర్వహించారు. మటన్, గుడ్లతో అడ్డంగా పట్టుబడటంతో అతడికి రూ.1000 జరిమానా విధించారు. అలాగే సులభ్ కాంప్లెక్స్ నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు రూ.20 వేల జరినామాను విధించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరూ ఆ వ్యక్తికి శిక్ష విధించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news