జొమాటో సీఈఒ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..వైరల్..

-

మనం ఎంత పెద్ద అయినా కూడా మన కింద పనిచేసే వారి గురించి ఆలోచించిన వాడే నిజమైన యజమాని అంటారు పెద్దలు..ఇప్పుడు ఓ వ్యక్తి అలానే చేశాడు..అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఒ..అయిన సాదాసీదా వ్యక్థిగా ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకున్నాడు..ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికెవ్వరికీ తెలియదు. ఇంతకీ ఎవరాయన? ఎందుకలా పని చేశారనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

 

 

కంపెనీ సీఈవో అంటే టిప్టాప్గా ఆఫీసుకు వస్తారు. పైస్థాయి ఉద్యోగులతో మీటింగ్లు నిర్వహిస్తారు. బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్స్ అమలు చేసి, కంపెనీ అభివృద్ధి, విస్తరణకు దోహదపడతారు. సాధారణంగా ఓ కంపెనీ సీఈవో డైలీ రొటీన్ వర్క్ ఇలానే ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా జొమాటో సీఈవో, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మరోలా ఆలోచించారు. తన కంపెనీలో సాధారణ డెలివరీ బాయ్లా రెడ్ టీ షర్ట్ ధరించి, బైక్ మీద ఫుడ్ డెలివరీలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కాదు ..ప్రతి మూడు నెలలకోసారి, గత మూడేళ్లలో ఆయన ఇదే పనిచేస్తున్నారట. ఈ విషయాన్ని నౌకరీ.కామ్ యాజమాని సంజీవ బిక్చందానీ బయటపెట్టారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

అతను మాత్రమే కాదు..కంపెనీలో పనిచేసే సీనియర్ మేనేజర్లందరూ ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతుంటారని సంజీవ్ తెలిపారు. రోజంతా ఫుడ్ డెలివరీలు చేస్తుంటారని చెప్పారు. గడిచిన మూడేళ్లుగా దీపిందర్ ఇదే పనిచేస్తున్నారని వివరించారు. అయినా ఇప్పటివరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్ తనతో చెప్పినట్లు సంజీవ్ తెలిపారు. సంజీవ్ ట్వీట్ చూసిన నెటిజన్లు జొమాటో సీఈఓపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ఫుడ్ను ఆయన డెలివరీ చేస్తే చూడాలని ఆసక్తిగా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట వైరల్ అవుతుంది…

Read more RELATED
Recommended to you

Latest news