అప్పుడు కోటి ఇస్తా అన్నాడు.. ఇప్పుడు 5 వేలు ఇస్తాడట..!

-

New India party candidate assures voters to give 5000 rupees

అప్పుడు కోటి రూపాయలు ఇస్తా అన్నాడు.. అయినా కూడా వోటర్లు మనోడిని గెలిపించలేదు. దీంతో ఇప్పుడు మరో పాట పాడుతున్నాడు. కోటి రూపాయలు ఇవ్వను కానీ.. ఈసారి నన్ను గెలిపిస్తే నెలకు 5 వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇంతకీ ఎవరీయన అంటారా? ఆయన పేరు రాజు. రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఓ రిక్షా మీద ప్రచారం చేస్తున్నాడు. తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి నెల నెలా 5000 రూపాయలు అందేలా చేస్తాడట. ఎట్లా ఇప్పిస్తాడో కూడా మైకు ద్వారా ఓటర్లకు చెప్పి వాళ్లను ఆకర్షిస్తున్నాడు.

ఇదివరకు 2014లో కూడా ఆయన పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాడు. అప్పుడేమో సైకిల్ మీద నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం నిర్వహించాడు. తనకు ఓటేస్తే కోటి రూపాయలు అందేలా చూస్తా అని అప్పుడు హామీ ఇచ్చాడు. కానీ.. అప్పుడు మనోడికి డిపాజిట్ కూడా దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news