జబర్దస్త్ షో.. జానీ మాస్టర్ కు షాకిచ్చిన మీనా..! వీడియో

-

ఈ షోకు పాపులారిటీ రావడానికి ఆ షో జడ్జీలు రోజా, నాగబాబు కావచ్చు.. యాంకర్స్ అనసూయ, రేష్మీ కావచ్చు… కామెడీ స్కిట్లు చేసే పార్టిసిపెంట్స్ కావచ్చు. ఎవరైనా నచ్చనీ.. అల్టిమేట్ గా ప్రేక్షకుడు కాసేపు ఆ షోను ఎంజాయ్ చేయగలుగుతున్నాడు.

బుల్లితెరపై విపరీతంగా హిట్ అయిన షో ఏది అంటే టక్కున చెప్పేయొచ్చు జబర్దస్త్ షో అని. కామెడీ స్కిట్లతో పార్టిసిపెంట్లు వేసే జోకులకు జడ్జీలతో సహా టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుడు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 9.30 అయిందంటే చాలు ప్రతి తెలుగు ప్రేక్షకుడు తమ ఇంట్లోని రిమోట్ ను పట్టుకొని ఈటీవీ పెడతారు. అయితే.. జబర్దస్త్ షోలో కామెడీ పేరుతో బూతు పురాణం కూడా పుష్కలంగా దొరుకుతున్నప్పటికీ… ఏదో కాసేపు సరదాగా నవ్వుకోవచ్చని చాలామంది షోను చూస్తుంటారు.

అయితే.. ఈ షోకు పాపులారిటీ రావడానికి ఆ షో జడ్జీలు రోజా, నాగబాబు కావచ్చు.. యాంకర్స్ అనసూయ, రేష్మీ కావచ్చు… కామెడీ స్కిట్లు చేసే పార్టిసిపెంట్స్ కావచ్చు. ఎవరైనా నచ్చనీ.. అల్టిమేట్ గా ప్రేక్షకుడు కాసేపు ఆ షోను ఎంజాయ్ చేయగలుగుతున్నాడు.

అయితే.. ప్రస్తుతం జబర్దస్త్ షోలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అది జడ్జీలు మారడం. అవును.. మొదటి నుంచీ జబర్దస్త్ కు జడ్జీలుగా ఉన్న రోజా, నాగబాబు.. ఇద్దరూ రాజకీయ బిజీ వల్ల జబర్దస్త్ ను మానేశారు. దీంతో షోను అలనాటి హీరోయిన్ మీనా, శేఖర్ మాస్టర్ తో నడిపిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కూడా ఈ మధ్య సినిమాలతో బిజీ అయిపోవడంతో.. జానీ మాస్టర్ ను ఇటీవల తీసుకొచ్చారు.



అయితే… జానీ మాస్టర్ వచ్చిన మొదటి ఎపిసోడ్ లోనే స్కిట్లలో పేలే జోకులకు పడి పడి నవ్వుతున్నాడు. తను కూర్చున్న సీట్ లోంచి లేచి మరీ నవ్వడం షోలో చూశాం. ప్రతి సారి అదే పనిగా ఆయన కుర్చీలోంచి లేచి నవ్వడం చూసి మీనాకు నచ్చలేదట. ఒక జడ్జి స్థానంలో ఉండి అలా పడి పడి లేచి నవ్వడం ఏంటని ఆమె చిన్నబోయిందట. ఆయన అలా పడి పడి లేస్తూ నవ్వుతున్న ఓ ఫోటోను మీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వచ్చే ఎపిసోడ్ నుంచి జానీ మాస్టర్ జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతాడా? అంటే మాత్రం వచ్చే వారం దాకా ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news