విషమంగా మారిన సమంత ఆరోగ్యం..ఫ్యాన్స్ టెన్షన్..

-

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే..గత కొన్ని నెలల నుంచి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తుంది. అందుకే సినిమాలకు కూడా దూరంగా ఉంది. ఈ విషయాన్ని తానే తన సోషల్ మీడియా వేదికగా తెలుపగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తనకు ధైర్యం ఇచ్చారు. అయితే ఈమె ప్రస్తుతం అస్వస్థకు గురైనట్లు దాంతో ట్రీట్మెంట్ కోసం సౌత్ కొరియాకు తరలించినట్లు తెలుస్తుంది. ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత నటిగా తన పరిచయాన్ని బాగా పెంచుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈమె గత సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. కారణం ఏంటో అందరికీ తెలిసిందే. మరో హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది. ఎవరెన్ని అన్నా కూడా సామ్ తన పని తాను చేసుకుంటూ వస్తుంది.వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేసుకుంటూ పోయింది.ఇటీవలే యశోద సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అయితే గత కొన్ని రోజుల నుండి ఆమె మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడటంతో ఆమె పలుచోట్ల చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి కోసం ఆమె గతంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంది.

ఇండియాకి వచ్చి చికిత్స చేయించుకుంది. అయితే ఆమెకు ఇంగ్లీష్ మందుల వల్ల ఎటువంటి రిజల్ట్ కనిపించక పోవడంతో ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు వెళ్లిందని తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మాత్రం మరింత విషమించింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, అందుకే దక్షిణ కొరియా దేశానికి తరలించినట్లుగా తెలిసింది. అకస్మాత్తుగా ఈమె పరిస్థితి ఇలా కావడానికి కారణం డిప్రెషన్ అని తెలుస్తుంది.. ఇటీవల అనారోగ్యం క్షీణించినప్పుడు కూడా భారీగా వర్కౌట్లు చేస్తూ కనిపించింది. దీంతో తన కండరాలపై ఒత్తిడి పడటంతో తన పరిస్థితి విషమించిందని తెలుస్తుంది. ఇక ఈ ట్రీట్మెంట్ కోసం ఆమె దక్షిణ కొరియాకు వెళుతున్నట్లుగా అక్కడ ఈ వ్యాధికి సంబంధించిన వైద్యం అందుబాటులో ఉందని తెలిసింది. దీంతో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు..సమంత కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news