విచిత్రం: బ్రాహ్మణులకు ప్రత్యేక మరుగుదొడ్డి

-

పెళ్లి చేయడానికి పెద్దలు కులం పేరు ఎత్తుతూ ఉంటారు. ఇంకా కొంతమంది పాతకాలం నాటి ఆలోచనలు ఉన్నవారు అయితే ఇంట్లో పని చేయడానికి కూడా కులం అనేది ఒక అర్హతగా బావిస్తూ ఉంటారు. తారలు మారుతున్నా ఈ కుల పిచ్చి లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి ఒక కుల పిచ్చోళ్ల వింత చర్య కేరళలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి,పెళ్లి చేయడానికి మాత్రమే అడిగే ఈ కుల ప్రస్తావన ఇప్పుడు మరుగుదొడ్డి వాడే విషయం లో కూడా కులం ప్రస్తావన వస్తుండడం గమనార్హం. కేరళలో కొందరు కుల పిచ్చోళ్లు ఒక అడుగు ముందుకు వేసి ‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’ అని రాసి పెట్టినట్లు తెలుస్తుంది. కుట్టుముక్కు మహాదేవ ఆలయంలో ఓ మూల ఉన్న టాయిలెట్ల వద్ద పై విధంగా రాసి పడేసినట్లు తెలుస్తుంది. మూడు టాయిలెట్ల ముఖద్వారాలపై ‘స్త్రీలకు’, ‘పురుషులకు’, మరియు ‘బ్రాహ్మణులకు’ అని రాసి ఉంది. దీనితో అరవింద్ క్రిస్టో అనే పీహెచ్డీ విద్యార్థి ఫోటోలు తీసి ఈ కులపిచ్చిని రట్టు చేశాడు.

అయితే ఈ టాయిలెట్ వ్యవహారం గత పాతికేళ్లుగా అక్కడ కొనసాగుతున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా దీనిపై నోరు మెదపలేదు. కానీ అరవింద్ క్రిప్టో మాత్రం ఫోటోలు తీసి ఈ విషయాన్నీ బయటపెట్టాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కదా, మరి ఆయన సన్నిధిలోనే ఈ వివక్షేంటి అని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆలయ నిర్వాహకులు విచారణకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news