కర్ణాటక ఎన్నికల బరిలో 2613 మంది అభ్యర్థులు…

-

కర్ణాటక ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది, అదే విధంగా మే 10వ తదీన ఎన్నికలు మరియు 12వ తేదీన ఫలితాలు రానున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మరియు జీడీఎస్ పార్టీలు కీలకం కానున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 58282 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. అయితే ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 .2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఇందులో మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నవారు మొత్తం 2613 మందిగా తెలుస్తోంది.

 

వీరిలో అత్యధికంగా బీజేపీ నుండి 224 మంది, కాంగ్రెస్ నుండి 223 మంది మరియు జేడీఎస్ 207 మంది పోటీ చేస్తున్నారు. మరి ఎవరు అధికారంలోకి రానున్నారు అన్న విషయం తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news