టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వరసగా రెండు పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి లైగర్ కాగా, మరొకటి పూరి డ్రీం ప్రాజెక్ట్ JGM. ఇప్పటికే లైగర్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయటానికి ముహూర్తం నిర్ణయించారు ఈ చిత్ర నిర్మాతలు పూరి, ఛార్మి, కరణ్ జోహార్.తాజాగా JGM మూవీ ని అధికారికంగా ఎనౌన్స్ చేసి టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేసారు పూరి జగన్నాధ్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందట. సోల్జర్ గా విజయ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . అయితే ఇది పాన్ ఇండియా సినిమా కావటంతో బాలీవుడ్ నటిని హీరోయిన్ గా పెట్టుకుంటే అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట పూరి. ఈ మేరకు సినియర్ అందాల నటి లేట్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్గా చేయమని ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నారట. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చెప్పటంతో జాన్వీ ఈ సినిమాకు యెస్ చెప్తుందని పూరి నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచిచూడాల్సిందే.
పూరి డైరెక్షన్లో శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ…?
By Karthik
-
Read more RELATEDRecommended to you
అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం
అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్...
Ganesh -
అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి
జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోర్ చేసిన డిల్లీ… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -