యూపీలో దారుణం.. తండ్రి మీద కోపంతో ఏడాది పాపను చంపిన బాలుడు

-

కోపం కొందరిని జీవితాలను చిన్నాభినం చేస్తుంది. కోపం వచ్చిన వాడు రగిలిపోతూ విచక్షణ రహితంగా మారుతుంటాడు. ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. అయితే 13 ఏళ్ల బాలుడు కోపంతో ఏడాది శిశువును చంపిన ఘటన కలకలం రేపుతోంది. పాప తండ్రి ఆ బాలుడి కుటుంబసభ్యులను దుర్భాషలాడటం, పబ్లిగ్గా అవమానించడమే కాకుండా బాలుడిని చెంపదెబ్బ కొట్టడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. రెండు, మూడు రోజులుగా కోపంతో రగిలిపోయిన ఆ బాలుడు చివరికి అభంశుభం తెలియని చిన్నారిని చంపడం ద్వారా తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి, జువైనల్ కేంద్రానికి తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, హత్య, ఆధారాలు లేకుండా చేయడం నేరాల కింద వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

Bowed Legs In Infants - Reasons, Signs, Diagnosis & Treatment

ఇంటి ముందున్న పాపను అపహరించిన బాలుడు నేరుగా తన పాఠశాల భవనంలోకి తీసుకెళ్లాడు. పాఠశాలలోని నీళ్ల ట్యాంకులోకి తోసేశాడు. నీటి ట్యాంకులోకి తోయడానికి ముందు పాప కాళ్లకు ఓ ఇటుకను కట్టాడు. మృతదేహం పైకి తేలకుండా ఉండేందుకు ఇలా చేశానని పోలీసుల విచారణలో బాలుడు చెప్పాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు పాప దుస్తులను మరో ప్రాంతంలో విసిరేశాడు. వాటర్ ట్యాంక్ పైకి బాలుడు వేగంగా ఎక్కిన తీరు గమనించి పోలీసులు విస్తుపోయారు.

ట్యాంకు నుంచి వచ్చే నీళ్లు దుర్వాసన రావడంతో పాఠశాల సిబ్బంది ట్యాంకులో పరిశీలించగా చిన్నారి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మీద అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ నేరాన్ని తానే చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత నిందితుడిని వెంటబెట్టుకెళ్లి పాప దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలుడు ఒక్కడే ఇదంతా చేశాడా? అతడికి ఇంకెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news