జియో బంపర్ ఆఫర్.. రూపాయికే 100 MB డేటా

-

రిలయన్స్ జియో… తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు జియో 1 జీబీ డేటా ను 15 రూపాయలకు అందిస్తుండగా… ఇక నుంచి 10 రూపాయలకే ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది రిలయన్స్ జియో కంపెనీ. అంటే ఈ లెక్కన ఒక్క రూపాయి కి 100mb ల డేటా మనకు లభిస్తుంది అన్నమాట. దీని వ్యాలిడిటీ నెల రోజులు పాటు ఉంటుందని తాజాగా పేర్కొంది. మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది జియో కంపెనీ.

ఈ ఆఫర్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది రిలయన్స్ జియో. దీంతో Jio నిర్ణయం మిగతా కంపెనీలను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు అత్యంత తక్కువ ధరకే డేటాను అందిస్తున్న సంస్థ తమదేనని రిలయన్స్ జియో స్పష్టం చేసింది. కాగా ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను రిలయన్స్ జియో భారీగా పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి కస్టమర్లు బయటికి వచ్చేందుకు జియో ఈ ఆఫర్ ప్రకటించినట్లు మనకు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news