ఏపీలో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 11 మంది టీచర్లు అరెస్ట్

-

ఏపీ నంద్యాల కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ స్కూల్ టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ లో 12 మంది అరెస్ట్ అయ్యారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లు అరెస్ట్ అయ్యారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని నంద్యాల కలెక్టర్ తెలిపారు.
పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తాసిల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారుల విచారణ చేపట్టామన్నారు.

పరీక్ష ప్రారంభమైన తర్వాత సిఆర్‌పి రాజేష్ తన మొబైల్‌తో ఫోటో తీసి సమాధానాల కోసం బయట వేచివున్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేసాడని వెల్లడించారు నంద్యాల కలెక్టర్. మాల్ ప్రాక్టీస్ చేసిన రాజేష్ తో పాటు 11 మంది టీచర్లు కూడా అరెస్ట్ చేసామని.. తెలుగు పండితులు నీలకంటేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నా అభాధ్యతారహితంగా ప్రవర్తించిన చీఫ్ సూపర్నెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ నలుగురిని సస్పెండ్ చేసామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news