నేపాల్​లో రెండు బస్సులు బోల్తా.. 12 మంది మృతి

-

నేపాల్‌లో రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మినీ బస్తు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్​లోని మకవాన్​పుర్​ వద్ద మినీ బస్సు బోల్తా కొట్టడం వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది గాయపడ్డారు. కాఠ్​మాండూ నుంచి బిర్‌గంజ్ వైపు వెళ్తున్న బస్సు మకవాన్‌పుర్ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పశ్చిమ నేపాల్‌లోని క్యాంగసిబగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాఠ్​మాండూ నుంచి రుకుమ్​కోట్​కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రుకుంపుర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news