తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..1,553 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 1,601 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉన్నాయి.

జిల్లాల వారిగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్సైట్ లో చూడాలని ఎస్పీడీసీఎల్ వెల్లడించింది. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి గతేడాది మేలో జారీ చేసిన నోటిఫికేషన్ ను ఆగస్టు నెలలో ఎస్పీడీసీఎల్ రద్దు చేసింది. జూలై 17న జరిగిన రాత పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఉద్యోగార్థులు నష్టపోకూడదని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో సంస్థ సీఎండీ జి.రఘురామరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news