బ్రేకింగ్‌: యూకే నుండి వచ్చిన వారిలో 16 మందికి కరోనా..

-

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నారు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది UK నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. 16 మంది 76 మందికి క్లోజ్ కాంటాక్ట్ లుగా ఉన్నట్లు గుర్తించారు. 16 మంది లో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి కోసం సిసిఎంబికి శ్యాంపిల్స్  పంపింది వైద్యశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news