2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది – చంద్రబాబు

-

2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని విధ్వంస సంవత్సరాలేనని.. జగన్ విధ్వంస పాలనకు ప్రజలు బాధ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసిక క్షోభ అనుభవిస్తున్నారని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు చంద్రబాబు. సంపద సృష్టించే యువ శక్తి రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని.. పోలీసుల అండ చూసుకొని వైసిపి గుండాలు, సైకోలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని.. జగన్ మాత్రం అవినీతిలో నెంబర్ వన్ గా నిలిచారని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న ముఖ్యమంత్రి కి బాధ లేదని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news