బడ్జెట్లో మిడిల్‌ క్లాస్‌కు వరాలు ప్రకటిస్తారని అంచనా..!

-

ఫిబ్రవరి 1న 2023 బడ్జెట్ ని సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. నిర్మల సీతారామన్ గురువారం ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక ప్రారంభించారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ హల్వా వేడుక గురువారం జరిగింది. ‘నేను మధ్య తరగతి సమస్యల్ని గుర్తించగలను. వారి కోసం ప్రభుత్వం చాలా చేసింది. ఇంకా చేస్తుంది’ అని నిర్మాలా సీతారామన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పన్ను విధానాల్లో మార్పులు చేస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. మినహాయింపులు పెంచడం, సెక్షన్‌ 80సీ పరిధి పెంచడం, కొన్నింటిని ఆ జాబితాలోంచి తొలగించి కొత్త సెక్షన్లు సృష్టించడం చేస్తుందని అంటున్నారు.

మధ్యతరగతి వర్గాలకు మేలు జరిగేలా మూలధన రాబడి పన్ను నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో వీరు ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్య బీమా ప్రీమియం చెల్లింపులను సులభం చేయనుందని అంటున్నారు. జీవిత బీమా మినహాయింపు కోసం ప్రత్యేక ప్రావిజన్లు ఏర్పాటు చేస్తారని అంచనా. కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత ఆదాయ పన్ను మినహాయింపును పెంచలేదు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ.2.5 లక్షలకు పెంచాక దీనిని పట్టించుకోలేదు. అలాగే 2019 నుంచి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 గానే ఉంది. ప్రభుత్వం స్టాండర్డ్‌ డిడక్షన్‌, మినహాయింపులను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి వేతన ఆధారిత మధ్య తరగతికి ఉపశమనం కల్పిస్తారని అంటున్నారు. మిడిల్‌ క్లాస్‌ కష్టాలు తనకూ తెలుసన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version