చిత్తూరులో రూ.250 కోట్లతో అమరరాజా ప్లాంట్

-

అమరరాజా అనుబంధ కంపెనీ మంగళ్‌ ఇండస్ట్రీస్‌ చిత్తూరు జిల్లా తేనేపల్లి లో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.250 కోట్లతో 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు అమరరాజా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు జయదేవ్‌ గల్లా పేర్కొన్నారు.

ఆటో కాంపోనెంట్లు, మెటల్‌ ఫ్యాబ్రికేషన్‌, బ్యాటరీ కాంపోనెంట్లు, స్టోరేజీ సొల్యూషన్లు మొదలైన వ్యాపారాల్లో మంగళ్‌ ఇండస్ట్రీస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులకు అమరరాజా బ్యాటరీస్‌ కట్టుబడి ఉందని, కొత్త ప్లాంట్‌ అందుకు నిదర్శనమని జయదేవ్‌ వెల్లడించారు. ఈ కొత్త ప్లాంట్‌ ద్వారా మరో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. మంగళ్‌ ఇండస్ట్ర్‌ కు ఇప్పటికే 9 తయారీ యూనిట్లు ఉన్నాయని, వీటిలో 300 మంది పని చేస్తున్నారని వివరించారు జయదేవ్‌ గల్లా.

Read more RELATED
Recommended to you

Latest news