వరంగల్లో రిజర్వాయర్లో పడి ముగ్గురు బాలురు మృతి..!

-

ఒక పక్క కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతుంటే.. మరో పక్క వివిధ ప్రమాదాల కారణంగా కూడా అనేక కుటుంబాల్లో విషయం నిండుతుంది. నిన్న కృష్ణ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ ఘటన మారువక ముందే వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఈ మరణాలకు కారణం మాత్రం రిజర్వాయర్. తాజాగా ఇవాళ వరంగల్ జిల్లా భీమారంలోని పుట్టలమ్మ రిజర్వాయర్ లో పడి ముగ్గురు బాలురు చనిపోయారు. భీమారానికి చెందిన ముగ్గురు బాలురు సైకిల్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు బాలురను వెలికి తీయగా..మరో బాలుడి ఆచూకీ లభించలేదు. సంఘటనా స్థలంలో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news