తెలంగాణాలో త్వరలో మరో 3 మంత్రి పదవులు !

-

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మూడు మంత్రి పదవులు భర్తీ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇలాంటి నేపథ్యంలో మరో మూడు మంత్రి పదవులు రాబోతున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన చేశారు.

ఇక అటు కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కు అభినందనలు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

ఇవాళ మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ తరుణంలోనే నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news