3 ఏళ్ళ బాలికకు మద్యం తాగించి.. కన్నతల్లి దారుణం !

-

తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పీకలదాకా తాగి కన్న బిడ్డను దారుణంగా కొట్టింది తల్లి. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మ రాల్ గ్రామానికి చెందిన కవిత అనే మహిళ ఇద్దరు అమ్మాయిలు. పని చేసుకోవడం రాదు. కాయకష్టం చేయకుండా యాచించుకుంటూ జీవితం గడుపుతూ వస్తోంది కవిత.

అలా వచ్చిన డబ్బులతో పీకలదాకా తాగే అలవాటు కూడా చేసుకుంది. తాగడం దేవుడికెరుక… ఆ మద్యం మత్తులో తన చిన్న పిల్లలను సైతం దారుణంగా కొట్టేది కవిత. ఇక రెండు రోజుల కిందట కవిత… మెదక్ రాంబస్ చౌరస్తా వద్ద మద్యం తాగుతుండగా తన మూడేళ్ల కూతురు నిత్య ఆమె దగ్గరికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారిని చితకబాదుతూ మద్యం తాగింది ఆ కసాయి తల్లి.

దీంతో మూడేళ్ల చిన్నారి నిత్యాకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇది అక్కడ స్థానికులు ఈ ఘటన చూసి వెంటనే ఆ బాలికను మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు స్థానికంగా ఉన్న పోలీసులకు కవిత పై ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్టు చేశారు. ప్రస్తుతం కవిత కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news