ఏపీలో నేడు కొత్త‌గా 31 క‌రోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ప్ర‌తి రోజు కూడా కేసుల సంఖ్య త‌గ్గుతూనే ఉన్నాయి. కాగ నేడు.. నిన్న‌టితో పోలిస్తే.. ఒక్క కేసు పెరిగింది. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా వైర‌స్ బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 31 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న రాష్ట్రంలో 30 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నిన్నటితో పోలిస్తే.. ఈ రోజు ఒక్క క‌రోనా కేసు పెరిగింది.

కాగ నేడు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడలేదు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో దాదాపు 30 రోజుల నుంచి క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డం లేదు. అలాగే గ‌డిచ‌న 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 66 మంది క‌రోనా వైర‌స్ బాధితులు వైర‌స్ బారీ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 450 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 10,372 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news