అనంతపురంలో కూలిన 4 అంతస్థుల భవనం..ఇద్దరు చిన్నారులు మృతి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఎప్పుడూ లేనన్ని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలోని… కదిరి పాత చైర్మన్ వీధిలో రెండు భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

నాలుగు అంతస్తుల భవనం కూలి రెండు అంతస్తుల భవనం పై పడింది. దీంతో రెండు భవనాలు కుప్పకూలాయి. అయితే ఈ రెండు భవనాలు కూలిన సమయంలో.. ఏకంగా పదకొండు మంది అందులోనే చిక్కుకుపోయారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని… సహాయక చర్యలు అందిస్తున్నాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటికి తీసుకెళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక ఇవాళ, రేపు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version