కల్తీ మద్యానికి 8 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది

-

లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్​లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. సారన్ జిల్లాలోని ఛప్రాలో కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.

కల్తీ మద్యం సేవించి బిహార్​లోని ఛప్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన బృందాన్ని గ్రామానికి పంపినట్లు సారన్ జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news