జారితే.. జమ్మలమడుగు జాతరే.. రైలుపై తిక్కవేశాలు..

-

కొందరు తమ వీడియోలకు ఎక్కువగా వీక్షణలు రావాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అవి కొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. కొన్ని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి కూడా. అయితే.. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నది. కాగా, 8 మంది వ్యక్తులు ఆ రైలు బోగీలపైన ఉన్నారు. ముగ్గురు దానిపై పరుగెత్తగా, మరో వ్యక్తి స్కిపింగ్‌ చేశాడు. మరి కొందరు రైలు బోగి టాప్‌పై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నిల్చొని ఉండగా, ఒకరిద్దరు కూర్చొని ఉన్నారు.

Men walks on running metro train shocking video viral mhkp - Globe News  Insider

కాగా, ఆ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నప్పుడు సమీపంలోని ఎత్తైన బిల్డింగ్‌ నుంచి ఒకరు ఈ వీడియో తీశారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లక్షలాది మంది దీనిని చూశారు. ఆ వ్యక్తుల ప్రమాదకర స్టంట్లను కొందరు విమర్శించారు. 1980లో రైలు పైన ప్రయాణించడం అమెరికాలో కామన్‌ అని ఒకరు గుర్తు చేశారు. పెట్రోల్‌ రేట్లు పెరుగుతుండటంతో ఇలాంటి సాహసాలు ఇంకా ఎన్ని చూడాలో అన్ని ఒకరు చమత్కరించారు. కాగా, ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news