గోవా బీచ్ లో బ్రిటన్ మహిళపై అత్యాచారం

-

ఉత్తర గోవా లోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ద స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది. గోవా టూర్ కు వచ్చిన ఆ విదేశీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలసి గోవా పర్యటనకు వచ్చిన బ్రిటన్ మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గోవాకు చెందిన 32 ఏళ్ల జోయల్ విన్సెంట్ డిసౌజా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గోవా పోలీసులు చెప్పారు.

ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు జోయల్ విన్సెంట్ డిసౌజా(32) అరెస్టు చేశారు. గురువారం స్వీట్ లేక్ వద్ద దంపతులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నిందితుడు జోయల్ అక్కడకు వెళ్ళి తాను మసాజ్ చేస్తానని చెప్పాడు. ఈ సమయంలో బ్రిటిష్ మహిళ భర్త.. తన భార్యకు ముల్తానీ మట్టితో మసాజ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని ఆమెకు మసాజ్ చేస్తున్నట్లు నటించి అత్యాచారం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news