BREAKING : కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు

-

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా 8 మంది మరణించారు. గాయపడ్డ వారు కోలుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా, చంద్రబాబు ప్రచార పిచ్చితో 8 మంది చనిపోయారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సభలు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించడం పై వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టవద్దని నాయకులు చెప్పిన వినకుండా పబ్లిసిటీ స్టాండ్ కోసం కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించాడు అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఫలితంగా నేను మంది అమాయకులు మరణించారని ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబు అంటూ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news