సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు పెట్టాలి – సత్యకుమార్

-

అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులైన సందర్భంగా మందండంలో నిర్వహించిన సభలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు నమ్మబలికి.. గెలిచిన తర్వాత మోసం చేసిన జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మొక్కవోని దీక్షతో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అభినందించారు.

అమరావతి రైతుల పోరాటానికి విజయం తధ్యమని అన్నారు సత్యకుమార్. అమరావతి ఒక సామాజిక వర్గానికే అని వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజధాని తరలింపు పై ఆందోళనతో చిన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. జగన్ రాక్షస క్రీడకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. జగన్ పై న్యాయవ్యవస్థ సుమోటోగా హత్యాయత్నం కేసు పెట్టాలని అన్నారు. జగన్ కుట్రలను అర్థం చేసుకున్న ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news