విజయవాడలో విషాదం..ప్రేమ వ్యవహారంతో దారుణ హత్య

-

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంతో దారుణ హత్య సంభవించింది. విజయవాడ కు చెందిన నవీన్ కు ఒంగోలులో శ్వేత అనే మైనర్ బాలిక తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.. దింతో సదరు మైనర్ బాలిక నవీన్ కోసం ఒంగోలు నుండి విజయవాడలోని నవీన్ ఇంటికి వచ్చేసింది.

దింతో సదరు బాలిక కుటుంబ సభ్యులు విజయవాడ చిట్టి నగర్ లోని శ్వేత మేనమామను తీసుకుని ప్రియుడి ఇంటికి నిన్న సాయంత్రం చేరుకుని నవీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి చిట్టినగర్ లోని మేనమామ ఇంటికి తాసుకువెళ్లారు.. కొద్దిసేపటికే శ్వేత ఇంటి నుండి వెళ్లిపోయింది.. దింతో మరలా నవీన్ ఇంటికి చేరుకున్న శ్వేత కుటుంబ సభ్యులు మేనమామ శ్రీనివాస్ నవీన్ ను నిలదీశారు.

తన వద్ద నుండి తాసుకపవెళ్లి మరలా తనను ప్రశ్నిస్తున్నారా అంటూ గొడవకు దిగడంతో పాటు చాక్ తో మేనమామ పై దాడికి దిగ్గాడు.. శ్రీనివాస్ ఛాతికి బలంగా గాయకావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.. ఆసుపత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.. దింతో సత్యనారాయపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news