జర్నలిస్టులకు షాక్.. ప్రెస్ స్టిక్కర్ వేస్తే రూ.1000 ఫైన్

-

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పుడు జర్నలిస్టులపై పడి పోతున్నారు. ప్రెస్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లు, పోలీస్‌ స్టిక్కర్లను తొలగించే పనిలో నిమగ్నమైన హైదరాబాద్‌ పోలీసులు రెచ్చి పోతున్నారు. ప్రెస్ స్టిక్కర్ వేస్తే రూ.1000 ఫైన్ వేస్తున్నారు.  ఉత్తుత్తిగా ఇలాంటి స్టిక్కర్లు బండ్ల మీద అతికించుకుని తిరిగే వాళ్లకు ఫైన్‌ వేయాల్సింది.. నిజమైన జర్నలిస్టులకు వేస్తూ.. వారికి చుక్కలు చూపిస్తున్నారు.

అసలు సిసలైన జర్నలిస్టులను పట్టుకుని.. బండికి ప్రెస్‌ స్టిక్కర్‌ వేసుకున్నావు కాబట్టి రూ.700 ఫైన్‌ కట్టు అని దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక నుంచి ప్రెస్‌ స్టిక్కర్లు కనిపిస్తే.. రూ.700 కట్టాల్సిందేనని వార్నింగ్‌ ఇస్తున్నారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్‌ కార్డును చూపించినా.. వినడం లేదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఫైన్‌ వేసి.. తమ వక్ర బుద్ది చూపించారు పోలీసులు.

అతడు అన్ని ఫ్రూప్స్‌ చూపించినా.. వినకుండా ఫైన్‌ వేశారు. జర్నలిస్టు అంటేనే.. 24 గంటల డ్యూటీ. ఓ అర్థరాత్రి రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి సమాజ సేవ చేసే వారిపై ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఏంటని సాటి జర్నలిస్టు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా ఈ కొత్త రూల్స్‌ నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని పాత్రకేయ లోకం కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news