వికారాబాద్‌ లో కేసులో ట్విస్ట్‌..చనిపోయిన తర్వాత బాలికను రేప్‌ చేసిన యువకుడు !

-

వికారాబాద్ : పదిహేనేళ్ళ బాలిక హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది.తానే హత్య చేసినట్టు ప్రియుడు మహేందర్ (నాని) పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. హత్య జరిగిన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన యువకుడు.. ఉదయం మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో బయటకు రమ్మని బాలికకు ఫోన్ చేశాడు.

గ్రామ చివరన నిర్మాణుష ప్రాంతంలో కులుసుకున్నారు ఇద్దరు. ఈ నేపథ్యంలోనే.. శారీరకంగా కలవాలని బాలికను కోరిన యువకుడు.. కానీ దానినిప్రతిఘటించింది బాలిక. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరుగగా… బాలికను బలంగా నెట్టాడు యువకుడు.

ఈ నేపథ్యంలోనే.. పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి.. మూర్చపోయింది బాలిక. మూర్చపోయిన బాలికను శారీరకంగా అనుభవించిన యువకుడు… ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశాడని తెలుస్తోంది. అంతేకాదు.. తనకేమీ తెలియనట్టు ఇంటికి వెళ్లి పడుకున్న యువకుడు.. హత్య జరిగిందని హడావుడి కావడంతో అందరితో కలిసి ఘటనాస్థలికి వెళ్లాడు. అయితే.. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news