ప్రమాదకర రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

-

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలలో సోదాలు నిర్వహించారు ఎస్ఓటి పోలీసులు. ఈ సందర్భంగా మూడు నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను సీజ్ చేశారు ఎస్ఓటి పోలీసులు. నకిలీ ఐస్ క్రీమ్ తయారుచేసి ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు వేసి అక్రమాలకు పాల్పడుతుంది ఈ ముఠా. అంతేకాదు ఇందులో ప్రమాదకరమైన రసాయనలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు.

కాలం చెల్లిన కెమికల్స్ ని వాడి ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది ఈ ముఠా. వివాహాది శుభకార్యాలకు కూడా నకిలీ ఐస్ క్రీములు సరఫరా చేస్తున్నారు. కొంతమందితో తోపుడు బండ్లలో నకిలీ ఐస్ క్రీమ్ ని అమ్మిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. మూడు కంపెనీలలో కోటికి పైగా ఐస్ క్రీమ్స్ ని సీజ్ చేశారు పోలీసులు. దూలపల్లి, చందానగర్, కూకట్పల్లిలో ఐస్ క్రీమ్ కంపెనీలు మూసివేశారు. జిహెచ్ఎంసి, హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిసి సోదాలు నిర్వహించారు సైబరాబాద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news