ఆర్డర్‌ ఆలస్యమైందని.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి

-

హైదరాబాద్​ నగరంలోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఫుడ్ డెలివరీ ఆర్డర్‌ లేట్ అయిందని, డెలివరీ బాయ్‌పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. తన 15 మంది అనుచరులతో కలిసి వచ్చి ఓ హోటల్‌ వద్ద భయానక వాతవరణం సృష్టించాడు.

భయంతో సదరు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ హోటల్‌లోకి పరుగులు తీయగా, వెంబడించిన వారు హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మరిగే నూనె మీద పడడంతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగిందని హోటల్‌ సిబ్బంది ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news