వామ్మో .. ఇదేంది…40 ఏళ్లుగా అదే తింటున్నాడా?

-

మనుసులు అన్నాకా ఆహారం తినాలి..జంతువులు గింజలు తినాలి..పశువులు గడ్డి తినాలి..ఇదేంది కొత్తగా అనుకుంటున్నారా.. కాస్త ఆగండి అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు…ఓ వ్యక్తి అన్నం బదులుగా ఇసుకను తిని బతుకుతున్నాడు..వామ్మో అతనిది పొట్ట లేక ఏదైనా గుట్ట అనే డౌట్ అందరికి వస్తుంది.కానీ అది నిజం అండీ బాబు.. ఒకటి, రెండు కాదు..ఏకంగా 40 ఏళ్ళుగా బస్తాలు ఇసుక తిన్నాడట.. ఆ ముచ్చట ఏందో ఇప్పుడు చుద్దాము..

హరిలాల్‌ది ఉత్తరప్రదేశ్ లోని గంజాం జిల్లా కీర్తిపూర్ గ్రామం. ఆయన భవన నిర్మాణకార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే ఉపాధి కోసం ప్రస్తుతం వలస వెళ్లాడు. హరిలాల్ కు ఇసుక అంటే చాలా ఇష్టం. మనం అన్నంతిన్నట్లుగా గత నలబైఏళ్లుగా ఇసుకను తినేస్తాడు.యూపీలోని అరంగాపూర్ లో పుట్టిన హరిలాల్ కు ప్రస్తుతం 68ఏళ్లు.. అతడికి చిన్నతనం నుండే ఇసుక తినడం అలవాటు. మనకు ఎవరైనా బిర్యాని పెడితే ఎలా లొట్టలేసుకొని తింటామో.. హరిలాల్ మెత్తటి ఇసుక దొరికితే అలా లొట్టలేసుకొని తినేస్తాడు. అతని గ్రామానికి దగ్గరలోనే నది ఉండటం వల్ల ప్రతీరోజూ ఆ నది దగ్గరికి వెళ్లడం ఇసుక తినడం అతనికి అలవాటుగా మారింది. వర్షాకాలం వస్తుందంటే హరిలాల్ ముందే అలర్ట్ అవుతాడు. నదిలోకి వరదనీరు వచ్చి ఇసుక దొరకదన్న ఉద్దేశంతో రెండుమూడు నెలలకు సరిపడా ఇసుక బస్తాల్లో నింపుకొని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేస్తాడు.

ఒకప్పుడు గ్యాప్ లేకుండా తినే ఆయన ఇప్పుడు మాత్రం కాస్త తగ్గించాడట..కుటుంబ సభ్యులు, తరువాత గ్రామస్తులు, తోటి కూలీలు ఎన్నిసార్లు ఇసుకను తినడం మానమని ఒత్తిడి తెచ్చినా హరిలాల్ మాత్రం ఇసుకే నా ప్రాణం అన్నట్లుగా ఇప్పటికీ ఇసుకను తింటూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మరో వ్యక్తి ఇసుక, కంకర తింటూ బతికేస్తున్నాడు. రాజ్ అనే వ్యక్తి గత 30ఏళ్లుగా ఇసుక, సన్నటి కంకర తింటూ బ్రతుకుతున్నాడు..అతని ఆ ఊరి వాళ్ళు ఏకంగా ఇసుక మనిషి అనే పేరు కూడా తగిలించారు.

Read more RELATED
Recommended to you

Latest news