కారుపై పడిన మట్టి పెళ్లలు.. ఇంటి యజమాని హత్య

-

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలుచేసింది. తన కారుపై మట్టిపెళ్లలు పడటంతో ఆవేశానికి గురైన ఓ ఇంజినీర్ పక్కింట్లో నివాసం ఉండే అన్నదమ్ములపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పుణె జిల్లా కాట్రాజ్ ప్రాంతానికి చెందిన సీతారాం పురి, భరత్ పురి అనే అన్నదమ్ములు తమ పాత ఇంటిని కూల్చివేత పనులు చేపట్టారు. ఇంటి శిథిలాలు వేరే ప్రాంతానికి తరలిస్తుండగా పక్కనే నివాసం ఉండే ఇంజినీర్ సచిన్ విఠల్ కప్టాకర్ కారు, ఇంటి ప్రాంగణంలో పడ్డాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కప్టాకర్ సీతారాం పురి, భరత్ పురి‌లతో ఘర్షణకు దిగాడు. కత్తితో సీతారాం పురి ఎడమ ఛాతీపై, భరత్ పురి కుడి ఛాతీపై పొడిచాడు. దీంతో సీతారాం పురి అక్కడికక్కడే మృతిచెందాడు. భరత్ పురి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు సచిన్ విఠల్ కప్టాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news