ఏపీలో దారుణం..యువతిపై పెట్రోల్ పోసిన ప్రేమోన్మాది

-

ఏపీలోని విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి పై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఏకంగా ఆ యువతిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించారు ఆమె క్లాస్ మేట్. ప్రేమకు నిరాకరించిందనే నేపథ్యంలోనే యువతిపై దాడి చేశాడు ఆ ప్రేమోన్మాది. మాట్లాడాలని లాడ్జికి తీసుకెళ్లిన ఆ యువకుడు… ప్రేమకు నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఆ యువతిపై పోసి తగలబెట్టాడు.

తర్వాత ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆ ఉన్మాది. అయితే.. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… విశాఖకు చెందిన యువతి, వరంగల్ కు చెందిన యువకుడుగా గుర్తించారు. పంజాబ్ లో ఇద్దరు బీటెక్ చదువుకున్నారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని కేజిహెచ్ కు తరలించామని… పూర్తిగా కాలిన గాయాలతో యువతి, యువకుడు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news