తెలంగాణలో మహిళలకు భారీ శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలోని మహిళలకు ఏటా 30,000 వారి అకౌంట్లలో జమ కానున్నాయి. వివరాల్లోకి వెళితే….తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందుగానే మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం అందించే పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాలలో ఒకటిగా నిలిచింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 30,000 ప్రతి సంవత్సరం అందుతాయి.

55 సంవత్సరాల లోపు పింఛన్ పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు దీనికి అర్హులుగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజులలోనే జమ అవుతాయి. ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి హామీల అమలుకు ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. దీంతో తెలంగాణలోని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.