తెలంగాణలో మరో విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య !

-

తెలంగాణలో మరో విషాదం. హైదరాబాద్ నార్సింగి లోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్ సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో తన క్లాస్ రూమ్ లో వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించు కోలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే… సాత్విక్ ను తరలించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news