లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

-

శుక్రవారం కాకినాడ లోని పిఠాపురం బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకునేందుకు బైక్ పై అన్నవరం వెళ్తూ డివైడర్ ను ఢీకొన్నారు కాకినాడకు చెందిన ప్రేమజంట.తీవ్ర గాయాలు తో రోడ్డు పక్కన పడి ఉన్న యువతి, యువకులను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైవే పెట్రోలింగ్ పోలీసులు.మార్గమధ్యలోనే యువకుడు మృతి చెందాడు. యువతికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

accident
accident

మృతుడు కాకినాడ జగన్నాదపురానికి చెందిన పాలేపు గణేష్ గా గుర్తించారు.డిగ్రీ చదువుతున్న గణేష్, ఇంటర్ చదివిన దీప్తి ల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ప్రేమ పెళ్లి కోసం అన్నవరం వెళ్తుండగా జరిగిన ప్రమాదం పై మృతుడు గణేష్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.యువతి బంధువులే చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని పోలీస్టేషన్ లో మృతుడు తల్లి పిర్యాదు చేసింది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పిఠాపురం పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version