తూగో జిల్లాలో మరో దారుణం..ప్రేమకు నిరాకరించిందని యువతిపై దాడి

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, కడియపులంకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో కొంతకాలంగా యువతి వెంట పడుతున్న అతడు తన ప్రేమను నిరాకరించిందని యువతి తో పాటు ఆమె తల్లి, సోదరిని సుత్తితో కొట్టాడు.

అనంతరం అతడు కూడా బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. ఉన్మాది దాడిలో గాయపడ్డ ముగ్గురితో పాటు అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news