ఏపీ ప్రభుత్వానికి ఏబీ వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ

-

అమరావతి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు లేఖ రాశారు. తనను ఇంకా సస్పెన్షన్లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఏబీవీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతోనే రెండేళ్లు నిండాయని లేఖలో గుర్తు చేశారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించాలంటే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పని సరనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు ఏబీవీ.

గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. తన సస్పెన్షన్ ముగిసినట్లేనని ఏబీవీ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం తనపై ఉన్న సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగి పోయినట్లే అని లేఖలో పేర్కొన్న ఏబీవీ… సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ తొలగినందున నా పూర్తి జీతం వెంటనే ఇవ్వండని డిమాండ్‌ చేశారు. నా సస్పెన్షనుకు ఆరేసి నెలల వంతున ఇచ్చిన పొడిగింపు జనవరి 27 తోనే ముగిసిందని.. 31.7.2021న చివరిసారిగా నా సస్పెన్షన్ను పొడిగిస్తూ ఇచ్చిన జీఓను రహస్యంగా ఉంచారు.. నాకు కాపీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనప్పటికీ… ఫిబ్రవరి 8తో నా సస్పెన్షన్ ముగిసినట్టేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news